బాదాం లో ఎన్ని పొషక విలువలు ఉన్నాయో అందరికీ తెలుసు.. ప్రతి రోజూ రెండు తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం అవుతాయని నిపుణులు అంటున్నారు.. ఇక ఖర్జూరాలు.. రక్థాన్ని పెంచుకునేందుకు ఇవి సహాయపడుతుంది. ఆరోగ్యానికి అందానికి బెస్ట్ ఖర్జూరాలు.. ఈ రెండింటిని కలిపి మంచి స్వీట్ చేసుకొని తింటే ఎలా వుంటుంది. వింటుంటే నోరు ఊరుతుంది కదా.. అవును వీటితో పాయసం చేసుకుంటే అదిరిపోతుంది.. ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసినవి:
ఎండు ఖర్జూరం తరుగు: పావు కప్పు
బాదం పప్పు:పావు కప్పు
ఎండుకొబ్బరి కోరు:పావు కప్పు
పాలు:మూడు కప్పులు
కలాకండ్:ఒక టీ.
పంచదార:పావు కప్పు
మరిగించి చల్లార్చిన పాలు:అర కప్పు
యాలకుల పొడి:కొద్దిగా
తయారి విధానం:
తరిగిన ఖర్జూరం, బాదంపప్పులను, ఎండుకొబ్బరి కోరును పేస్టులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలాకండ్తోపాటు పాలల్లో కలిపి సన్నటి సెగమీద వేడి చేయాలి. మిశ్రమం చిక్కబడుతుండగా పంచదార, మరిగించిన పాలు కలపాలి. పంచదార బాగా కరిగిన తరువాత యాలకుల పొడి వేసి దించాలి.. అంతే పాయసం రెడీ..