పాదాల నొప్పులు తగ్గాలంటే ఇలా చేయాలి..

మనం తినే ఆహారం వల్ల కొద్ది దూరం వెళ్ళినా ఆయాసం రావడం, పాదాల నొప్పులు రావడం కూడా ఈరోజుల్లో కామన్. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఆనొప్పులు తగ్గుతాయని అంటున్నారు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రోజుకు రెండు సార్లు వెచ్చని నీటిలో పాదాలను ఒక పదినిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత ఐస్‌ను ఒక టవల్‌లో పెట్టి పాదాలను చుట్టి పెట్టాలి. ఇలా చేయటం వల్ల నొప్పి తగ్గుతుంది.ఇంటా బయట కూడా రబ్బరు చెప్పులు వేసుకోవాలి. ఈ మధ్యకాలంలో కాళ్ల నొప్పులు ఉన్నవారి కోసం కొన్ని ప్రత్యేకమైన చెప్పులు దొరుకుతున్నాయి.

వాటిని ఉపయోగిస్తే చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.వీలైనంత వరకూ హైహీల్స్‌ను వేసుకోవద్దు.కాలి కండరాలను బలోపేతం చేసే కొన్ని ఆసనాలు ఉన్నాయి.ఇక్కడ మరో విషయం ఏంటంటే పాదాలను ఎప్పుడూ కిందకు పెట్టడం తో పాటుగా అప్పుడప్పుడు పైకి పెట్టుకోవడం మేలు..

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.