నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నీటిలో శరీరానికి కావలసిన మినరల్స్, పొషకాలు అందుతాయని అంటున్నారు.ఎటువంటి రొగాన్ని నయం చేయాలన్న నీళ్ళు బెస్ట్ వే.. రోజుకు 5 లీటర్ల నీళ్ళు తాగాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.. అయితే నీళ్ళు తాగుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. లేకుంటే ప్రాణానికి ప్రమాదం ఉందట అదేంటో ఒకసారి చూద్దాం..

సాధారణంగా మనలో చాలా మంది నీటిని నిలబడి తాగుతుంటారు. నిల్చొని నీళ్లు తాగితే నరాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ద్రవ్య సమతుల్యత దెబ్బతినడం, అజీర్తి, గ్యాస్, అసిడిటీ వంటి ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. ఆయుర్వేదం ప్రకారం నిలబడి నీరు తాగితే అది కింద పొట్టలోకి వెళ్తుంది. ఇది మీకు పోషకాలను అందనివ్వదు. నీళ్ళను నేరుగా మింగకుండా తాగాలి.

భోజనానికి ముందు నీరు తాగితే బరువు తగ్గుతారని అనుకుంటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం ఇది సరైన పద్ధతి కాదు. ఇలా చేయడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోగా జీర్ణ వ్యవస్థ ను అస్తవ్యస్తం చేస్తాయి.వ్యాయామం చేసి 30 నిమిషాల ముందు తర్వాత నీళ్ళను తాగాలి. భోజనం చేసే ముందు కూడా అలానే తీసుకోవాలి.. ఇది గుర్తుంచుకోండి…