ఏడాది లో ఒకసారి వచ్చే పండ్లలో ఒకటి నేరేడు..వగరుగా,తియ్యగా వుండే ఈ పండ్ల ను చిన్నా,పెద్ద అందరు ఇష్టపడతారు..అయితే ఈ పండ్లను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయొజనాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నేరేడు లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్ల ఎన్నో సమస్యల నుంచి బయట పడతారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
నేరేడు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదే విధంగా దగ్గు, జలుబు, జ్వరం, ప్లూ వంటి సమస్యల నుండి బయట పడవచ్చు.
మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయి.. దాని వల్ల మతిమరుపు వచ్చే అవకాశం ఉండదు..
పొటాషియం ఉంటుంది ఇది బ్లడ్ సర్క్యులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. దీనితో హైబీపీ హైపర్టెన్షన్ నుండి రక్షిస్తుంది..
యూరిన్ సమస్యలు ఉన్న వాళ్ళు వీటిని తీసుకోవడం వల్ల నయం అవుతాయి..
కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా ఇది చూసుకుంటుంది. హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.. అందుకే సీజన్ లో వీలైనప్పుడు నేరేడు పండ్లను తీసుకోవడం మంచిది..
వీటితో పాటుగా హై బిపి సమస్యల నుంచి బయట పడేలా చేస్తుంది. గుండెకు రక్థాన్ని అందించి మంచి ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు దోహదపడుతుంది.. అందుకే ఏడాది లో ఒకటి అన్నా నేరేడు తినాలని వైద్యులు చెబుతున్నారు.