తాజాగా వుండే ఆహారాన్ని తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. అయితే జనాలు మాత్రం రుచిగా వుండే ఆహారాలను ఎంచుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూన్నారు.పొషక విలువలు ఉన్న ఆరోగ్యాన్ని పక్కన పెట్టి జంక్ ఫుడ్స్ ను ఇష్టంగా తింటున్నారు. జంక్ ఫుడ్ టేస్ట్ కు అడిక్ట్ అయ్యేవారు క్రేవింగ్స్ తో సతమతమవుతుంటారు. వీటిలో యాడెడ్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి, అంతేకాదు సాల్ట్, శాచురేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్ అత్యధికంగా ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వలన చూపు,వినికిడి సమస్యలను కూడా ఎదుర్కుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.జంక్ ఫుడ్’కు ఎక్కువగా అలవాటు పడిన వారు త్వరగా అనారోగ్యాలకు గురవుతుంటారు. జంక్ ఫుడ్’లో జీర్ణాశయంలో, జీర్ణం చెందించబడని, కొవ్వు పదార్థాలు నూనెలు ఉంటాయి. వీటిని ఒకసారి తీసుకుంటే మన గొయ్యి మనమే తీసుకున్నట్లు అని నిపుణులు చెబుతున్నారు..బర్గర్లు, పిజ్జాలు, బిస్కెట్లు, కేకులు తినడం వల్ల మీరు కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవించగులుగుతారు.. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. చుసారుగా జాగ్రత్త సుమీ.. ఇప్పటి నుంచి వీటికి దురంగా ఉండటం చాలా మంచిది..