కరోనా దెబ్బ తో మనుషులకు ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది.అలాంటి వాళ్ళు ఒక కప్పు హెర్బల్ టీ ని తాగండి అంటున్నారు నిపుణులు.ఈ టీ వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటుగా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఆ టీ గురించి తెలుసుకుందాం..
అశ్వగంధ టీ..
అశ్వగంధ శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతూ వస్తోంది. ఇది సహజ పదార్ధం. శరీరక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని డికాక్షన్గా, టీగా తీసుకోవచ్చు. హార్మోన్ల అసమతుల్యత వల్ల మానసిక కల్లోలం, బరువు పెరుగుట, ఒత్తిడికి దారి తీస్తుంది.
గ్రీన్ టీ:
గ్రీన్ టీ లో శరీరానికి కావలసిన యాంటీఆక్సిడెంట్ లు ఉన్నాయి.బరువు తగ్గడం, రోగనిరోధక శక్తిని పెంచడం, నరాలపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రధానంగా టీ ప్లాంట్లో ఉండే థియనైన్ అనే అమినో యాసిడ్ ఒత్తిడిని దూరం చేస్తుంది.
తులసి టీ,లావెండర్ టీ లు కూడా ఒత్తిడి ని దూరం చేస్తాయి.తలనొప్పి, కండరాల నొప్పులను తగ్గిస్తుంది. మీరు కూడా ట్రై చెయ్యండి..